Pawan Kalyan

Pawan Kalyan: కేబినెట్‌ మీటింగ్‌ మాధలోనే వెళ్లిపోయిన పవన్.. ఎందుకంటే..?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఏపీ కేబినెట్ సమావేశం నుంచి మధ్యలోనే అర్ధాంతరంగా నిష్క్రమించి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయన తల్లి అంజనా దేవికి ఒక్కసారిగా అనారోగ్యం రావడంతో, వెంటనే ఆసుపత్రికి తరలించారని తెలియడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈరోజు ఉదయం (సోమవారం) ప్రారంభమైన కేబినెట్ సమావేశానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే, సమావేశం మొదలైన కొద్దిసేపటికే ఆయన తల్లి అంజనా దేవి ఆరోగ్యం బాగోలేదని సమాచారం అందింది. ఈ వార్త తెలియగానే, మెగా కుటుంబంలో ఆందోళన నెలకొంది. పవన్ కళ్యాణ్ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకుని, తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు.

Also Read: Samantha: సమంతకు బిగ్ షాక్?

Pawan Kalyan: అంజనా దేవిని కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆమె ఏ రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నారనే దానిపై స్పష్టత లేదు. అయితే, తల్లి ఆరోగ్యంపై ఆందోళన చెందిన పవన్ కళ్యాణ్, తన మంత్రిమండలి సమావేశాన్ని విడిచిపెట్టి వెంటనే తల్లి వద్దకు బయలుదేరి వెళ్లారు. గతంలో కూడా అంజనా దేవి ఆరోగ్య సమస్యలతో బాధపడిన సందర్భాలు ఉన్నాయని, ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించి ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి, అంజనా దేవి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మెగా అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *