Pawan Kalyan: జగన్ కు ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ తీరు పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా అంశంపై ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇచ్చేది కాదు, ప్రజలు ఇస్తేనే వస్తుంది. 11 సీట్లు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?” అంటూ ప్రశ్నించారు. జనసేన ప్రస్తుతానికి ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీ అయినప్పటికీ, ప్రతిపక్ష హోదా సంపాదించాలంటే సభలో హాజరై ప్రజాసమస్యలు ప్రస్తావించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అసెంబ్లీలో వైసీపీ తీరు బాగోలేదని విమర్శించిన పవన్, వైసీపీ సభ్యులకు స్పీకర్ గౌరవం ఇచ్చినప్పటికీ, వారు హుందాతనం పాటించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, పార్లమెంటరీ విధానాలను పాటించాలని వైసీపీ నేతలను కోరారు. “ఈ ఐదేళ్ల పాటు మీకు ప్రతిపక్ష హోదా రాదు, దీనికి మానసికంగా సిద్ధంగా ఉండాలి” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చారని గుర్తుంచుకుని, అనుగుణంగా ప్రవర్తించాలని వైసీపీ నేతలకు సూచించారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష హోదా విషయంలో జనసేన స్పష్టమైన వైఖరి తీసుకోవడం, సభలో జనసేన పాత్ర ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *