One nation one election:

One nation one election: జ‌మిలి ఎన్నిక‌ల‌పై 31 మందితో జేపీసీ

One nation one election: జ‌మిలి ఎన్నిక‌ల‌పై జేపీసీ (జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ)ని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు క‌మిటీలో 21 మంది లోక్‌స‌భ స‌భ్యుల జాబితాను ప్ర‌క‌టించింది. మ‌రో 10 మందిని రాజ్య‌స‌భ నుంచి అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. లోక్‌స‌భ స‌భ్యుల జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ముగ్గురు ఎంపీల‌కు అవ‌కాశం ద‌క్కింది. కాంగ్రెస్ అగ్ర‌నేత ప్రియాంకా గాంధీ స‌హా ప‌లువురు సీనియ‌ర్ స‌భ్యుల‌కు ఈ క‌మిటీలో అవ‌కాశం క‌ల్పించారు.

One nation one election: వారిలో పీపీ చౌద‌రి, డాక్ట‌ర్ సీఎం ర‌మేశ్‌, బ‌న్సూరీ స్వ‌రాజ్‌, పురుషోత్తం బాయ్ రూపాలా, అనురాగ్‌సింగ్ ఠాకూర్‌, విష్ణుద‌యాల్ రామ్‌, భర్తృహరి మ‌హ‌తాబ్‌, డాక్ట‌ర్ సంబిత్ పాత్ర‌, అనిల్ బాలుని, విష్ణుద‌త్ శ‌ర్మ‌, ప్రియాంకగాంధీ వాద్రా, మ‌నీష్ తివారీ, సుఖ్‌దేవ్ భ‌గ‌త్‌, ధ‌ర్మేంద్ర యాద‌వ్‌, క‌ల్యాణ్ బెన‌ర్జీ, టీఎం సెల్వ గ‌ణ‌ప‌తి, జీఎం హ‌రీశ్ బాల‌యోగి, సుప్రియా సూలే, డాక్ట‌ర్ శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే, చంద‌న్ చౌహాన్‌, బాల‌శౌరి వ‌ల్ల‌భ‌నేని ఉన్నారు.

One nation one election: జాయింట్ క‌మిటీ సిట్టింగ్‌ను ఏర్పాటు చేయడానికి కోరం మొత్తం క‌మిటీ స‌భ్యుల‌లో మూడింట ఒక వంతు ఉండాలి. క‌మిటీ త‌దుప‌రి సెష‌న్ చివ‌రి వారం తొలిరోజు నాటికి ఈ స‌భ‌కు ఒక నివేదిక‌ను త‌యారు చేసి ఇస్తుంది. ఇత‌ర అంశాల‌లో పార్ల‌మెంట‌రీ క‌మిటీల‌కు సంబంధించి ఈ స‌భ విధి విధానాలు, ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి, స్పీక‌ర్ చేయ‌గ‌ల వైవిధ్యాలు, స‌వ‌ర‌ణ‌ల‌తో వ‌ర్తిస్తాయి. రాజ్య‌స‌భ నుంచి క‌మిటీలోకి తీసుకునే స‌భ్యుల‌ను తెల‌పాల‌ని కేంద్రం రాజ్య‌స‌భ‌కు సూచిస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chiranjeevi: దీపికాతో చిరు రొమాన్స్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *