Modi: ప్రధాన మంత్రి మోదీ జీఎస్టీ పండుగ ప్రారంభం – అన్ని వర్గాలకు లబ్ధి

Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ (సామాన్య సేవా పన్ను) సంస్కరణలపై ఒక లేఖను విడుదల చేశారు. ఆయన ప్రకారం, ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా జీఎస్టీ పండుగ ప్రారంభమైందని తెలిపారు. ఈ సంస్కరణలు రాబోయే తరాల ప్రజల్లో పొదుపు అభివృద్ధికి తోడ్పడతాయని, రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి వర్గం, వ్యాపారులు, ఎంఎస్ఎంఈలతో సహా ప్రతి వర్గానికి నేరుగా లబ్ధి చేకూరుతుందని హామీ ఇచ్చారు.

జీఎస్టీ విధానం ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసి, పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని ప్రధాని చెప్పారు. ప్రతి రాష్ట్రం యొక్క ప్రగతిని వేగవంతం చేస్తూ, వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వ కార్యాచరణల వల్ల కొన్నేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కూడా ఆయన తెలిపారు.

ప్రధాన మంత్రి ఆదాయపు పన్నును రూ. 12 లక్షల వరకు మినహాయించడం, జీఎస్టీ సంస్కరణల వంటి కొత్త విధానాలతో ఒక ఏడాదిలోనే ప్రజలకు రూ. 2.50 లక్షల కోట్ల డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. జీఎస్టీ స్థానిక తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని, దుకాణదారులు స్వదేశీ తయారీ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని, ప్రజలు కూడా స్వదేశీ ఉత్పత్తులను ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకూ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పాటుచేయాలని సూచించారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *