Botsa Satyanarayana

Botsa Satyanarayana: ప్రజల సమస్యలపై మంత్రులకు బాధ్యత లేదు

Botsa Satyanarayana: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రులకు ఏమాత్రం బాధ్యత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం కేవలం కుర్చీ కోసం మాత్రమే ఆరాటపడుతోందని ఆయన మండిపడ్డారు.

“ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి చలనం లేదు”
50 ఏళ్లకే పెన్షన్ గురించి ప్రజలు అడుగుతుంటే ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదని బొత్స ఆరోపించారు. ’50 ఏళ్లకే పెన్షన్ గురించి అడిగితే మంత్రులు సమాధానం చెప్పడం లేదు’ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నా, ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

తిరుపతి, సింహాచలం ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
బొత్స మాట్లాడుతూ, ఇటీవల తిరుపతి, సింహాచలంలో జరిగిన ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు, దేవుడు అంటే లెక్కలేదని, ఎంతసేపూ కుర్చీ కోసమే ఆరాటం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై వెంటనే దృష్టి సారించాలని బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *