Mahesh Kumar goud: బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే దొంగ ఓట్లు సృష్టించబడ్డాయి

Mahesh Kumar goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్‌లో కేసీఆర్‌ సభ పెట్టినా బీఆర్ఎస్‌ గెలవదని ఆయన స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే దొంగ ఓట్లు సృష్టించబడ్డాయని, ఆ అంశంపై ప్రశ్నిస్తున్నది రాహుల్‌ గాంధీయే అని మహేష్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఆ సమయంలో సోమేష్‌కుమార్‌ ఉన్నప్పుడే దొంగ ఓట్లు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.

ప్రజలను తప్పుదారి పట్టించేందుకు బీఆర్ఎస్‌ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు వర్థిల్లవని హెచ్చరించిన మహేష్‌కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రజలతోనే ఉందని, నిజాయితీతో వ్యవహరిస్తోందని అన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *