ktr

KTR: తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి

KTR: పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.  ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయని ‘ఎక్స్‌’ వేదికగా అన్నారు.

”పోరాడి సాధించుకొని..
పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..
ప్రజాస్వామిక తెలంగాణలో..
మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి..

ఇందిరమ్మ రాజ్యంలో
ప్రశ్నిస్తే కేసులు…
హక్కులను అడిగితే బెదిరింపులు..
పోరాడితే సస్పెన్షన్లు…
ఇది నియంతృత్వ రాజ్యం…నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం..

పోరాటం తెలంగాణకు కొత్తకాదు..ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నది..
ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం..
ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతాం”

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *