KCR:

KCR: కేసీఆర్‌కు మ‌ళ్లీ అస్వ‌స్థ‌త.. హైద‌రాబాద్‌కు త‌ర‌లించే యోచ‌న‌!

KCR: బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మ‌ళ్లీ అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. నిన్న‌టి (ఆగ‌స్టు 23) నుంచి ఈ రోజు వ‌ర‌కు ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఎర్ర‌వ‌ల్లిలోని ఫాంహౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల‌ను కూడా అక్క‌డికి రప్పించారు. కేసీఆర్ ర‌క్తంలో షుగ‌ర్‌, సోడియం స్థాయిల్లో హెచ్చుత‌గ్గులు ఉన్న‌ట్టు అక్క‌డికి వెళ్లిన ప్ర‌త్యేక‌ వైద్యులు గుర్తించారు. ఈ మేర‌కు ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

KCR: ప్ర‌త్యేక వైద్యుల బృందం కేసీఆర్‌కు ఎర్ర‌వ‌ల్లి ఫాంహౌజ్‌లోనే వైద్య చికిత్స‌లు అందిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌త్యేక వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఉన్న‌ట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న‌ది. ఈ విష‌యం తెలియ‌గానే కేసీఆర్ త‌న‌యుడు, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రులు హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్‌రెడ్డి ఎర్ర‌వ‌ల్లికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. తీవ్ర‌త‌ను బ‌ట్టి హైద‌రాబాద్ త‌ర‌లించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Donald Trump: రష్యాపై కోపం.. భారత్‌పై ఆగ్రహం: ట్రంప్ బెదిరింపులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *