India vs Bangladesh

India vs Bangladesh: టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది.. 376 పరుగులకే ఆలౌట్!

India vs Bangladesh: చెన్నై టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది. మ్యాచ్ రెండో రోజున, టీమ్ ఇండియా 339 పరుగులతో ఆటను కొనసాగించింది. అయితే, బంగ్లాదేశ్ రెండవ కొత్త బంతితో కేవలం 37 పరుగులకే చివరి 4 వికెట్లను చేజిక్కించుకుంది. ఇందులో రవీంద్ర జడేజా వికెట్ అత్యంత కీలకమైనది. ఎందుకంటే, జడేజా తన ఐదో టెస్టు సెంచరీని కొద్దిలో కోల్పోయాడు. తొలిరోజు అద్భుతమైన సెంచరీ చేసిన రవిచంద్రన్ అశ్విన్ కూడా వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో ఔటయ్యాడు. బంగ్లాదేశ్ తరఫున యువ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ 5 వికెట్లు తీసి తనదైన ముద్ర వేయగా, రెండో రోజు తస్కిన్ అహ్మద్ 4 వికెట్లలో 3 వికెట్లు పడగొట్టాడు.

రెండో రోజు ఇన్నింగ్స్ ఎక్కువసేపు సాగలేదు

India vs Bangladesh: సెప్టెంబర్ 20 శుక్రవారం చెపాక్ స్టేడియంలో టీమ్ ఇండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 339 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలిరోజు క్లిష్ట పరిస్థితుల నుంచి టీమిండియాను గట్టెక్కించిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మరోసారి క్రీజులోకి వచ్చారు. తొలి రోజు టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 166 పరుగుల వద్ద ఉండగానే వీరిద్దరి భాగస్వామ్యం మొదలైంది. ఇక్కడి నుంచి వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్న తర్వాత టీమ్‌ఇండియాను పటిష్ట స్థితికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అశ్విన్ తన సొంతగడ్డపై మరో సెంచరీ సాధించగా, జడేజా సెంచరీకి చేరువయ్యాడు.

India vs Bangladesh: రెండో రోజు జడేజా తన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మార్చే అవకాశం వచ్చినా అది కుదరలేదు. ఈరోజు మూడో ఓవర్‌లోనే పేసర్‌ తస్కిన్‌ అహ్మద్‌ వేసిన బంతికి స్లిప్‌లో క్యాచ్‌ ఔటయ్యాడు. అతను తన స్కోరు 86 పరుగులకు పరుగులేమీ జోడించకుండానే.. తన ఐదో టెస్టు సెంచరీని కోల్పోయాడు. దీని తర్వాత, ఆకాష్ దీప్ 17 పరుగుల ముఖ్యమైన సహకారం అందించాడు. అయితే, అశ్విన్ తన స్కోరుకు మరో 10 పరుగులు మాత్రమే జోడించగలిగాడు. వారిద్దరినీ కూడా తస్కిన్ డిస్మిస్ చేశాడు. 112 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి అశ్విన్ అవుటయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా రూపంలో చివరి వికెట్ పడింది. ఈ విధంగా రెండో రోజు పావుగంట వ్యవధిలోనే భారత జట్టు ఆలౌట్ అయింది.

హసన్ మహమూద్ 5 వికెట్లు.. 

India vs Bangladesh: బంగ్లాదేశ్‌కు రెండో రోజు స్టార్ టాస్కిన్, చివరి 4 వికెట్లలో 3 వికెట్లు తీసుకున్నాడు.  అయితే ఈ ఇన్నింగ్స్‌లో హసన్ మహమూద్ స్టార్ యువ ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. ఈ 24 ఏళ్ల పేసర్, తన నాలుగో టెస్టును మాత్రమే ఆడుతున్నాడు,  బుమ్రాను అవుట్ చేయడం ద్వారా ఇన్నింగ్స్‌లో తన 5 వికెట్లను పూర్తి చేశాడు. తొలి రోజే 4 వికెట్లు తీసి టీమ్ ఇండియా టాప్ ఆర్డర్‌లో విధ్వంసం సృష్టించి భారత జట్టును కష్టాల్లో పడేసాడు. ఓవరాల్‌గా కొన్ని వారాల క్రితం పాకిస్థాన్‌పై ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన మహమూద్.. భారత్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించి, సిరీస్‌లోని మిగిలిన ఇన్నింగ్స్‌లకు కూడా టీమిండియాను హెచ్చరించాడు.

ALSO READ  India vs South Africa: ఫైనల్లో త్రిష మాయాజాలం.. 82 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *