School Teachers

School Teachers: భారత విద్యా రంగంలో చారిత్రక ఘట్టం: కోటి దాటిన ఉపాధ్యాయుల సంఖ్య

School Teachers: భారత విద్యా రంగం ఒక సరికొత్త మైలురాయిని చేరుకుంది. దేశ చరిత్రలో తొలిసారిగా పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య కోటి మార్కును దాటినట్లు కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇది భారత పాఠశాల విద్యలో ఒక గొప్ప పురోగతిగా నివేదిక పేర్కొంది.

యూ-డైస్ ప్లస్ నివేదికలో కీలక విషయాలు:
కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్’ (U-DISE+) 2024-25 నివేదిక ప్రకారం, ప్రస్తుతం దేశంలో ఉపాధ్యాయుల సంఖ్య 1.01 కోట్లుగా నమోదైంది. ఇది గత విద్యా సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. 2023-24లో ఈ సంఖ్య 98 లక్షలుగా, అంతకుముందు 2022-23లో 94.8 లక్షలుగా నమోదైంది. ఈ పెరుగుదల, విద్యార్థి-ఉపాధ్యాయుల నిష్పత్తి (PTR) మెరుగుపడటాన్ని సూచిస్తుంది, తద్వారా విద్య నాణ్యత పెరుగుతుందని నివేదిక తెలిపింది.

Also Read: Amaravati: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయాలు: ప్రతి కుటుంబానికి ప్రత్యేక ఫ్యామిలీ కార్డు

విద్యా వ్యవస్థలో సానుకూల మార్పులు:
ఉపాధ్యాయుల సంఖ్య పెరగడంతో పాటు, మరికొన్ని సానుకూల మార్పులు కూడా నివేదికలో వెల్లడయ్యాయి. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిల్లో విద్యార్థుల డ్రాపౌట్ రేట్లు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా, ఉన్నత స్థాయి పాఠశాలల సంఖ్య పెరగడం విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి ఎంతగానో తోడ్పడుతోందని నివేదిక వివరించింది.

ప్రభుత్వాల కృషి ఫలించింది:
ఈ పురోగతికి ప్రభుత్వాల చిత్తశుద్ధి ప్రధాన కారణమని నివేదిక అభిప్రాయపడింది. విద్యార్థులు నమోదుకాని పాఠశాలలు (జీరో ఎన్‌రోల్‌మెంట్) ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలల సంఖ్య బాగా తగ్గిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 6 శాతం తగ్గగా, సున్నా నమోదు ఉన్న పాఠశాలల సంఖ్య 38 శాతం తగ్గడం ఒక గొప్ప ముందడుగు అని నివేదిక హైలైట్ చేసింది. ఈ పెరుగుదల కేవలం సంఖ్యలపరంగానే కాకుండా, దేశంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యానికి ఒక బలమైన సంకేతంగా నివేదిక పేర్కొంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి: ఉత్తరకాశీని ముంచెత్తిన వరదలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *