Hyderabad: సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతల కీలక నిర్ణయాలు

Hyderabad: నిర్మాతలు, ఫెడరేషన్‌ సభ్యులతో జరిగిన ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సినీ కార్మికుల వేతనాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వేతనాల పెంపును మూడు విడతల్లో అమలు చేయాలని నిర్మాతలు అంగీకరించారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం —

తొలి ఏడాది వేతనాలను 15 శాతం పెంచనున్నారు.

రెండో, మూడో సంవత్సరాల్లో తలో 5 శాతం పెంపు అమలు కానుంది.

రూ. 2,000 లోపు వేతనం పొందుతున్న వారికి తొలి ఏడాదిలోనే 15 శాతం పెంపు ఉంటుంది.

రూ. 1,000 లోపు వేతనం పొందుతున్న వారికి తొలి ఏడాదిలోనే 20 శాతం పెంపు ఉంటుంది.

చిన్న సినిమాల కోసం మాత్రం పాత వేతనాలే కొనసాగించబడతాయి.

నిర్మాతలు స్పష్టం చేసినట్టుగా, ఈ పెంపులు అన్ని వర్గాల అంగీకారం, షరతులపై సమ్మతి ఉన్నప్పుడే అమలులోకి వస్తాయి.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *