Hyderabad: మేడిపల్లి హత్యకేసులో సంచలన వివరాలు

Hyderabad: హైదరాబాద్‌ మేడిపల్లిలో జరిగిన హత్యకేసులో విచారణలో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. భర్త మహేందర్‌రెడ్డి తన భార్య స్వాతిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మహేందర్‌రెడ్డి, స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్వాతి ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తుండగా, మహేందర్‌రెడ్డి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో వికారాబాద్‌లో 498A కేసు కూడా నమోదైంది.

హత్యకు కారణం:

ఈ నెల 22న గర్భవతి అయిన స్వాతి మెడికల్ చెకప్‌కి తీసుకెళ్లమని మహేందర్‌రెడ్డిని కోరింది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగి, గొడవ తీవ్రంగా పెరిగింది.

హత్య ప్రణాళిక:

మహేందర్‌రెడ్డి బోడుప్పల్‌లో ఒక హాక్సాబ్లేడ్ కొనుగోలు చేసి హత్యకు సిద్ధమయ్యాడు. భార్యను హత్య చేసిన తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసి, తల, చేతులు, కాళ్లను వేర్వేరు కవర్లలో చుట్టి, మూడు సార్లు మూసీకి వెళ్లి పారేశాడు. తర్వాత తన చెల్లికి ఫోన్ చేశాడు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *