Hyderabad: మద్యం ప్రియులకు శుభవార్త.. ఇక నుంచి మస్తు కేఎఫ్ బీర్లు..

Hyderabad: తెలంగాణలోని మందుబాబులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో మరోసారి కింగ్‌ఫిషర్‌ మరియు హెన్‌కిన్‌ బీర్ల సరఫరా పునరుద్ధరించబడుతోంది. ఈ విషయాన్ని వాటి తయారీ సంస్థ అయిన యునైటెడ్‌ బ్రేవరీస్‌ ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తరువాత, బీర్ల సరఫరాపై తమ నిర్ణయాన్ని సోమవారం వెల్లడించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో వినియోగదారులు, కార్మికులను దృష్టిలో ఉంచుకుని సరఫరాను పునరుద్ధరించాలని కంపెనీ నిర్ణయించింది. బీర్ల ధరల పెంపు మరియు బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తమ సంస్థ అనుసరించబోతుందని తెలిపింది.

స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావం

కింగ్‌ఫిషర్‌ బీర్ల పునరుద్ధరణ ప్రకటన తర్వాత యునైటెడ్‌ బ్రేవరీస్‌ షేర్లు భారీగా పెరిగాయి. ఒక్కదశలో ఆరు శాతం పెరిగి, ఇంట్రాడేలో రూ.2075 వద్ద గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి 5.54 శాతం లాభంతో షేర్‌ ధర రూ.2059.40 వద్ద స్థిరపడింది.

ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ విలువ రూ.53.51 వేల కోట్లు. తెలంగాణ మార్కెట్‌లో బీర్ల సరఫరా పునరుద్ధరణతో యునైటెడ్‌ బ్రేవరీస్‌ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. కింగ్‌ఫిషర్‌ బీర్ల తిరిగి రావడం వినియోగదారుల్లో హర్షాన్ని కలిగిస్తోంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ponguleti Srinivas: సీఎం మార్పుపై పొంగులేటి క్లారిటీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *