Hyderabad: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసిన కమిషన్ తన సంపూర్ణ నివేదికను ప్రభుత్వం ముందు ప్రవేశపెట్టింది. ఈ నివేదికపై తాజాగా జరిగిన అధికారిక సమావేశం ముగిసింది.
ముఖ్యాంశాలు:
కమిషన్ స్పష్టంగా సూచించింది – బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలి.అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ పాత్రపై ప్రత్యేకంగా ప్రకటనలు ఉన్నాయి.
నిర్మాణాలు కేసీఆర్, హరీష్ రావు ఆదేశాలపైనే జరిగినట్టు కమిషన్ స్పష్టం చేసింది.ఇరిగేషన్ శాఖ ఇచ్చిన అంచనాలను ఆర్థికశాఖ పరిశీలించకుండా గుడ్డిగా ఆమోదించడం తప్పుగా పేర్కొంది.
ఆర్థికశాఖ కనీసంగా తన బాధ్యతలు నిర్వర్తించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.అధికారుల పాత్ర, పరీక్షల లోపాలు, ప్రాజెక్ట్ ఆమోద విధానం వంటి అంశాలపై కమిషన్ దృష్టి సారించింది.
రేపు కీలక మలుపు:
రేపు కేబినెట్ భేటీలో ఈ నివేదికపై సమగ్ర చర్చ జరగనుంది.
అధ్యయన కమిటీ తయారు చేసిన బ్రీఫ్ రిపోర్ట్ను కేబినెట్కు అందించనున్నారు.అనంతరం ఆసెంబ్లీలో పూర్తి నివేదికను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

