Hyderabad: సినీ కార్మికులతో చర్చలు విఫలం

Hyderabad: సినీ కార్మికుల వేతనాల పెంపు విషయమై నిర్మాతలతో జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగిశాయి. నిర్మాతల ప్రతిపాదనలను కార్మికుల ఫెడరేషన్‌ తిరస్కరించింది. పర్సంటేజ్ విధానానికి తాము ఒప్పుకోలేమని స్పష్టం చేసింది.

ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ— “30 శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కు హాజరవుతాం. నిర్మాతల షరతులను అంగీకరించడానికి సిద్ధమే, కానీ అన్ని యూనియన్ల కార్మికులకు సమానంగా వేతన పెంపు ఉండాలి” అని అన్నారు.

అతను ఇంకా పేర్కొంటూ, “యూనియన్లను విడగొట్టేలా నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఇది సమంజసం కాదు. రేపటి నుంచి నిరసనలు మరింత ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *