Crime News

Crime News: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

Crime News: కొందరు మొగవారికి ఒక రోగం ఉంటుంది. వన్స్ ఆ రోగం ఒంట్లోకి వస్తే…చచ్చేంత వరకు పోదు. అంత పెద్ద రోగం అది. మరి ఆ రోగం తగ్గేది ఎలా ? దానికి సోలుషన్ ఒక్కటే…సింపుల్ గా …శ్వాస తీసుకోవడం ఆపేయడమే. అర్తం కాలేదా..అదే చనిపో అని . లేకుంటే ఈ రోగంతో ఇంట్లో వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి మరి. అందుకే …అంత మాట అన్నది .

అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామంలో చోటుచేసుకుంది. తుపాకుల పార్వతీ స్థానికంగా నివాసముంటోంది.ఆమె భర్త అశోక్‌ గత కొంత కాలంగా ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.

Crime News: దీంతో అర్థరాత్రి ఆగ్రహంతో భార్య పార్వతీని హత్య చేశాడు.. అనంతరం పరారయ్యాడు. ఉదయం కుటుంబ సభ్యులు చూడగా అప్పటికే పార్వతీ మృతి చెంది ఉంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కూచిపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cm chandrababu: రాష్ట్ర పునర్నిర్మాణమే తమ లక్ష్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *