Harish Rao

Harish Rao: కాంగ్రెస్ కు ప్రజలన్నా.. దేవుళ్ళన్నా లెక్కలేదు

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు ప్రజలన్నా.. దేవుళ్ళన్నా లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమన్నారు. గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని.. కోడెలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని, కనీస స్పందన కూడా లేదని అన్నారు.

కనీసం కోడెలకు గడ్డిపెట్టే పరిస్థితి కూడా లేదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నారని..ఎందుకు ఇంత నిర్లక్ష్యమని మండిపడ్డారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితే ఇలా ఉంటే ఎలా? అని ధ్యజమెత్తారు. కోడెలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే, బిఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండని హరీష్ రావు అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *