Gold Price Today

Gold Price Today: ఆకాశాన్నంటుతున్న పసిడి.. తెలుగు రాష్ట్రాలలో కొత్త రికార్డు.. తులం ఎంతంటే!

Gold Price Today: ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ రాజకీయాలలో నెలకొన్న అస్థిరత కారణంగా ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టడానికి చాలా మంది బంగారం (Gold), వెండి (Silver) వైపే మొగ్గు చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది బంగారం ధర ఏకంగా 55% పెరగడం గమనార్హం. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే పెద్ద పెరుగుదల.

లక్షన్నర వైపు పసిడి పరుగు:
బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం ధర లక్షా 30 వేల రూపాయల వైపు దూసుకుపోతోంది. త్వరలోనే ఇది లక్షన్నర మార్కును కూడా చేరుకునే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టడానికి అత్యంత సురక్షితమైన, నమ్మకమైన మార్గంగా వీటిని భావిస్తున్నారు.

కొత్త రికార్డు నమోదు:
ఈ గురువారం దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,000 దాటి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాలు, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు వంటి అంతర్జాతీయ అంశాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

నేటి (అక్టోబర్ 16) ధరల వివరాలు:

తాజా వివరాల ప్రకారం, ఈ రోజు దేశీయంగా ధరలు ఇలా ఉన్నాయి:
* 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ.1,29,450

* 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ.1,18,660

వెండి ధర కూడా భారీగా:

బంగారంతో పాటు వెండి ధర కూడా రికార్డు స్థాయికి చేరింది.

* కిలో వెండి ధర: రూ.1,90,100 ఉంది.

* హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది నగరాల్లో కిలో వెండి ధర ఏకంగా రూ.2,07,100 ఉంది. అంటే, కిలో వెండి రెండు లక్షల రూపాయల మార్కును దాటేసింది. ఇది కూడా మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ప్రధాన నగరాల్లో ధరలు (10 గ్రాములకు):

నగరం              24 క్యారెట్లు        22 క్యారెట్లు
హైదరాబాద్       రూ.1,29,450      రూ.1,18,660
విజయవాడ       రూ.1,29,450      రూ.1,18,660
ముంబై            రూ.1,29,450      రూ.1,18,660
ఢిల్లీ                రూ.1,29,600      రూ.1,18,810
చెన్నై              రూ.1,29,390      రూ.1,18,610
బెంగళూరు       రూ.1,29,450     రూ.1,18,660

పెట్టుబడికి బంగారమే తొలి ఎంపిక:
గత 20 సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తే… 2005లో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.7,638 మాత్రమే ఉండేది. ఇప్పుడు అది రూ.1,30,000 చేరుకుంది. ఈ సుదీర్ఘ కాలంలో బంగారం 16 సంవత్సరాలుగా మంచి లాభాలను అందిస్తూ, నమ్మదగిన పెట్టుబడి మార్గంగా నిలిచింది. అందుకే, ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు మొదటగా బంగారం, వెండినే ఎంచుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *