Telangana

Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఎరువుల కోసం రోజుల తరబడి దుకాణాల చుట్టూ తిరుగుతున్నా సరైన సరఫరా లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ఆందోళన వివరాలు:
గత పదిహేను రోజులుగా యూరియా కోసం ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నామని రైతులు తెలిపారు. పంటలకు యూరియా వేసే సమయం దాటిపోతుందని, తమ పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది” అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో ముస్తాబాద్ మండల కేంద్రంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమస్యను పరిష్కరించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే యూరియా సరఫరాను మెరుగుపరచాలని కోరుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  ACB Raids: తవ్వుతున్నా కొద్దీ కోట్ల గుట్ట‌లు.. ఏసీబీ రైడ్స్‌లో కండ్లు బైర్లు క‌మ్మే నిజాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *