EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ EPF ఖాతాల్లో నిల్వలపై 8.25% వడ్డీ రేటు కొనసాగించనుంది. శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే వడ్డీ రేటు 2023-24 సంవత్సరానికి కూడా అమలులో ఉంది.
Also Read: AP Budget: 3.22 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్.. వాటికోసమే అధిక కేటాయింపులు
సీబీటీ సిఫార్సును కేంద్ర ఆర్థికశాఖకు పంపించనుండగా, ఆమోదం లభించిన తర్వాత EPFO అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆ తర్వాత ఈ వడ్డీ మొత్తాన్ని 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో జమ చేయనుంది.
గతంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ EPF వడ్డీ రేటును 8.1%కి తగ్గించారు, ఇది 1977-78 తర్వాత అత్యల్ప స్థాయి. అయితే, గత రెండు సంవత్సరాలుగా స్వల్పంగా పెంచి ఇప్పుడు 8.25% వద్ద స్థిరంగా కొనసాగించడం గమనార్హం.