AP news: ఐపీఎస్ సంజయ్ పై విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

AP news: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ చీఫ్‌గా, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా పనిచేసినప్పుడు ఏపీఎస్ సంజయ్ పెద్ద ఎత్తున అవినీతి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించింది.

విజిలెన్స్ అధికారులు చేసిన లోతైన విచారణలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో, వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా, ముఖ్యమంత్రి కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంజయ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యని ఆలిండియా సర్వీసెస్ డిసిప్లేన్ యాక్ట్ (1969) సెక్షన్ 3(1) కింద తీసుకున్నారు.

అలాగే, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులను విచారణ చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో, ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఈ అవినీతిపై విచారణ ముమ్మరం చేసారు.

యాంటీ కరెప్షన్ యాక్ట్ 17A ప్రకారం, ప్రభుత్వ అధికారిపై విచారణ జరపాలంటే ఆయనను తొలగించే అధికారి అనుమతి అవసరం. ఈ క్రమంలో, ఏసీబీ అధికారులు సర్కార్‌ను రిక్వెస్ట్ చేసి, సంజయ్‌పై ప్రాసిక్యూషన్‌ తీసుకోవడానికి అనుమతి కోరారు.

సంజయ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు శనివారం జారీచేసింది. విచారణ అనంతరం నేడు లేదా రేపు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రాథమికంగా తెలుస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kavitha: కేటీఆర్, కేసీర్‌లకు హరీష్ రావ్‌తో ముప్పు.. సంచలన విషయాలు బయటపెట్టిన కవిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *