Assam

Assam: అస్సాంలో ఏనుగుల బీభత్సం.. హడాలిపోతున్న ప్రజలు!

Assam: ప్రస్తుతం అస్సాంలో ప్రజలు ఏనుగుల భయంతో బెంబేలెత్తుతున్నారు. ఏనుగులు పంటలతో పాటు ఇళ్లను కూడా దెబ్బతీస్తున్నాయని ప్రజలు అంటున్నారు. అస్సాం మీడియా సమాచారం ప్రకారం, ఎగువ అస్సాంలోని అనేక జిల్లాల్లో ఏనుగులు, మానవుల మధ్య ఘర్షణ ఆగడం లేదు. అడవుల నుంచి బయటకు వచ్చి ఆహారం వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశించిన ఏనుగులు ప్రస్తుతం ప్రజల పంటలు, ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. ఉగ్రరూపం దాల్చిన గజరాజుల గుంపు  ఎగువ అస్సాంలోని పలు జిల్లాల్లో భీభత్సం సృష్టిస్తోంది. గత 3 నుండి 4 సంవత్సరాలలో, ఎగువ అస్సాంలోని గోలాఘాట్, హోజాయ్, వెస్ట్ కర్బీ, అంగ్లాంగ్ తదితర జిల్లాల్లో ఏనుగులు గరిష్ట విధ్వంసం సృష్టిస్తూ వస్తున్నాయి. అస్సాంలోని హోజాయ్ – వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాల్లోని డజన్ల కొద్దీ గ్రామాలపై అడవి ఏనుగులు దాడి చేస్తూనే ఉన్నాయి. 

Assam: వెస్ట్ కర్బీ అంగ్లాంగ్‌లోని హోజాయ్‌లోని చెరకు పొలాల్లో ప్రతిరోజూ కనీసం 70 నుండి 80 ఏనుగుల గుంపు ప్రజలకు నిద్రలేని రాత్రులు తీసుకువస్తోంది. ఏనుగులు సమీపంలోని అడవుల నుంచి బయటకు వచ్చి ఆహారం వెతుక్కుంటూ నివాస ప్రాంతాల వైపు వచ్చి పంటలను ధ్వంసం చేయడమే కాకుండా రైతుల ఇళ్లకు కూడా చాలా నష్టం కలిగిస్తున్నాయి. ఏనుగులు, మనుషుల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఒక్కోసారి మనుషులు, కొన్నిసార్లు గొంతులేని ఏనుగులు కూడా నష్టాలను చవిచూస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *