Raana Daggubati

Raana Daggubati: బెట్టింగ్ యాప్ కేసు: రానాకు ఈడీ మరోసారి నోటీసు

Raana Daggubati: బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. మొదట జులై 23న విచారణకు హాజరు కావాలని ఈడీ సూచించినా, అప్పటికే ఇతర కార్యక్రమాలు, షూటింగ్ షెడ్యూల్‌ల కారణంగా రానా హాజరుకాలేకపోతానని విజ్ఞప్తి చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఈడీ, తాజాగా ఆగస్టు 11న హాజరుకావాలని కొత్త నోటీసు పంపింది.

Also Read: Supreme Court: సంజయ్‌కు 49 పేజీలతో ముందస్తు బెయిల్‌ తీర్పా? సుప్రీంకోర్టు షాక్

ఈ కేసులో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు నటులకు నిర్వాహకులు ఇచ్చిన రెమ్యునరేషన్‌లో మనీలాండరింగ్ జరిగిందనే అనుమానంతో ఈడీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో రానాతో పాటు నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలకు కూడా నోటీసులు అందాయి.

ఇప్పటికే మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరయ్యే గడువు కోరినట్టు సమాచారం. ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల విచారణ మరింత ఆసక్తికరంగా మారుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *