Bangalore

Bangalore: బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు.. అసెంబ్లీలో రచ్చ!

Bangalore: బెంగళూరులో 223 మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని హోంమంత్రి పరమేశ్వర్ అసెంబ్లీలో తెలిపారు. లింగాసుకూర్ బిజెపి సభ్యుడు మనప్ప వజ్జల్ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు హోంమంత్రి సమాధానం ఇచ్చారు.

గత 20 ఏళ్లలో, రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న 556 మంది విదేశీయులను గుర్తించారు. బెంగళూరులో 223 మంది, తంగవేయల్‌లో 7 మంది; మంగళూరు నగరంలో 41; రాంనగర్‌లో 11; ధార్వాడలో 2; విజయపురలో 33; దక్షిణ కన్నడలో 15; ఉత్తర కన్నడ, రాయచూర్‌లలో ఒక్కొక్కరు, ఉడిపిలో 10; శివమొగ్గలో 12; హసన్‌లో 3; చిత్రదుర్గలో 10; బెంగళూరు జిల్లాలో 60 మందిని, కొన్ని జిల్లాల్లో మరికొందరిని గుర్తించారని పరమేశ్వర్ వెల్లడించారు.

అక్రమ నివాసితులను వారి దేశాలకు బహిష్కరించడానికి మేము విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదిస్తున్నాము. మేము ఇప్పటివరకు 193 మందిని బహిష్కరించాము. 212 మందిని బహిష్కరించే ప్రక్రియ కొనసాగుతోంది అంటూ పరమేశ్వర్ సమాధానమిచ్చారు. అయితే, ఈ సమాధానంతో బీజేపీ ఎమ్మెల్యే మనప్ప వజ్జల్ సంతృప్తి చెందలేదు.

Also Read: Borugadda Anil: ఏపీ హై కోర్టు సీరియస్..లొంగిపోయిన బోరుగడ్డ

ఒక్క “విజయపుర జిల్లాలోనే 15,000 మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు సమాచారం ఉంది అని ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తే, రాష్ట్రంలో లక్షలాది మంది విదేశీయులు ఉండవచ్చు. వారికి ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు ఇచ్చారు అంటూ ఆరోపించారు.

మరో బిజెపి ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఇక్కడ చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారు జాతీయ భద్రతకు ముప్పు” అని అన్నారు. బంగ్లాదేశీయులు కాఫీ ఎస్టేట్లలో పనిచేస్తారు. “ఇది చాలా తీవ్రమైన విషయం” అని ఆయన అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *