Crime News:

Crime News: అనాథ‌ను తెచ్చుకొని అమ్మ‌లా పెంచిది.. ఆ క‌నుపాపే ఆ అమ్మ‌ను కాటేసింది!

Crime News: రోడ్డున భార్యాభ‌ర్త‌లు వెళ్తుంటే అంద‌రూ గుమిగూడారు.. ఏమిటా తొంగి చూశారిద్ద‌రూ.. ఓ ప‌సికందును ఎవ‌రో వ‌దిలేసి వెళ్లారు.. అంద‌రిలాగే ఆమె కూడా చ‌లించింది.. ఇత‌రులంతా చూసి వెళ్తుంటే.. ఆ జంట మాత్రం అక్క‌డే నిలిచిపోయింది.. పిల్ల‌లు లేని త‌మ‌కు ఆ ప‌సిగుడ్డుపై మ‌మ‌కారం పెరిగి ఇంటికి తెచ్చుకున్నారు.. పెంచి పెద్ద చేసుకున్నారు.. ఒడిశాలో జ‌రిగిన ఆ ఘ‌ట‌న‌లో ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో.. వివ‌రాలు తెలుసుకుందాం రండి..

Crime News: ఒడిశాలోని గ‌జ‌ప‌తి జిల్లా ప‌ర్లాఖిముండి ప‌ట్ట‌ణంలో ఆ ఘ‌ట‌న వెలుగు చూసింది. రోడ్డున ప‌డేసిన పాప‌ను స‌మీపంలోని ఓ గ్రామంలో నివాసం ఉండే రాజ్య‌లక్ష్మి దంప‌తులు ఆ ప‌సికందును తెచ్చి ద‌త్త‌తు తీసుకొని పెంచుకున్నారు. అయితే ఆ పాప‌ను తెచ్చుకున్న ఏడాదిన్న‌రకే రాజ్య‌ల‌క్ష్మి భ‌ర్త క‌న్నుమూశారు. ఉన్న ఆ ఒక్క‌గానొక్క తోడే లోకంగా భావించిన రాజ్య‌ల‌క్ష్మి ఆ బాలిక‌ను అల్లారుముద్దుగా పెంచుకోసాగింది.

Crime News: పాప పెద్ద‌గైన కార‌ణంగా చ‌దువుల కోసం రాజ్య‌ల‌క్ష్మి ప‌ర్లాఖిముండికి వ‌చ్చి అక్క‌డే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉన్నారు. ఈలోగా ఆ బాలిక కూడా పెరిగి పెద్ద‌గై 8వ త‌ర‌గ‌తికి చేరింది. అల్లారు ముద్దుగా పెంచిన ఆ త‌ల్లి ప్రేమ‌ను ఆస‌రా చేసుకున్న ఆ బాలిక ఆ వ‌య‌సులోనే తోటి విద్యార్థులైన గ‌ణేశ్ ర‌థ్ (21), దినేశ్ సాహు (20)తో సంబంధం పెట్టుకున్న‌ది.

Crime News: ఈ విష‌యం రాజ్య‌ల‌క్ష్మికి తెలియ‌డంతో పెంపుడు కూతురును మంద‌లించింది. అప్ప‌టి వ‌ర‌కూ పువ్వుల్లో పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకున్న రాజ్య‌ల‌క్ష్మి ఆ బాలిక‌ను మంద‌లించ‌డ‌మే త‌ప్ప‌యింది. ఆ మంద‌లింపుతో రాజ్య‌ల‌క్ష్మిపై ఆ బాలిక కోపం పెంచుకున్న‌ది. ఆ కోపం మ‌రింత‌గా ముదిరి ఏకంగా ఆమెను చంపేయాల‌నే క‌సి పెంచుకున్న‌ది. ఆమెను చంపితే ఆస్తికూడా త‌న సొంతం అవుతుంద‌ని భావించింది.

Crime News: రాజ్య‌ల‌క్ష్మిని చంపేందుకు పెంపుడు కూతురు ప్లాన్ చేసింది. ఆమెను ఈ విష‌యంలో గ‌ణేశ్ ర‌థ్ అనే బాలుడు కూడా ప్రేరేపించిన‌ట్టు తెలిసింది. దీంతో రోడ్డుపై అనాథ‌లా మారిన ప‌సికందును పెంచి పెద్ద చేసినందుకు రాజ్య‌ల‌క్ష్మిని చంపే ప్లాన్ చేసింది. నిద్ర‌మాత్ర‌లు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసింది. ఈ లోగా ఆ ఇద్ద‌రు బాలురును కూడా ర‌ప్పించింది. ముగ్గురూ క‌లిసి రాజ్య‌ల‌క్ష్మి మొహంపై దిండు పెట్టి ఊపిరాడ‌కుండా చేసి చంపేశారు.

Crime News: ఆ త‌ర్వాత అనారోగ్యంతో ఉన్న‌ద‌ని న‌టిస్తూ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే చ‌నిపోయింద‌ని వైద్యులు నిర్ధారించ‌డంతో ఇంటికి తీసుకొచ్చారు. గుండెనొప్పితో చ‌నిపోయింద‌ని న‌మ్మ‌బ‌లికారు. ఆమెకు అప్ప‌టికే గుండెపోటు ఉండ‌టంతో నిజ‌మేన‌ని బంధువులు కూడా న‌మ్మి భువ‌నేశ్వ‌ర్‌లోని బంధువుల స‌మ‌క్షంలోనే ద‌హ‌న‌కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ALSO READ  Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు!

Crime News: ఆ త‌ర్వాత రాజ్య‌ల‌క్ష్మి సోద‌రుడు శిబా ప్ర‌సాద్ మిశ్రా ఆ బాలిక మొబైల్ ఫోన్‌లో చూడ‌గా అస‌లు ప్లాన్ తెలిసింది. రాజ్య‌ల‌క్ష్మి హ‌త్య‌కు ప్లాన్ చేసుకున్న మెసేజ్‌లు క‌నిపించాయి. ఆ చాట్‌లోనే రాజ్య‌ల‌క్ష్మిని చంపి, ఆమె బంగారు న‌గ‌లు తీసుకెళ్లిన స‌మాచారం ఉన్న‌ది. దీంతో ఆ ముగ్గురూ క‌లిసి రాజ్య‌ల‌క్ష్మిని చంపార‌ని నిర్ధారించుకున్న మిశ్రా ప‌ర్లాఖిముండి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో రాజ్య‌ల‌క్ష్మి పెంపుడు కూతురుతోపాటు ఆమె ఇద్ద‌రు స్నేహితుల‌ను అరెస్టు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *