Revanth Reddy

Revanth Reddy: ఈనెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Revanth Reddy: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈనెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడులో నిర్వహించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు.

ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు. భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సభ జరిగే ప్రాంతం, పార్కింగ్ స్థలాలు, భద్రతా ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం. పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఇళ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొననున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాహేతర బంధం పెట్టుకుంటే కేసులే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *