Rythu Bharosa

Rythu Bharosa: గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా

Rythu Bharosa: రైతులకి మరో  గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 2025 సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. దీనిపై విధివిధానాల ఖరారుకు కేబినెట్‌ సబ్‌కమిటీ వేశామన్న రేవంత్ తెలిపారు.. కార్యాచరణపై అసెంబ్లీలో కూడా చర్చిస్తామన్నారు. బీజేపీ,బీఆర్‌ఎస్,నేతలు చెప్పిన మాటలు రైతులు ఎవరు నమోదు అన్నారు.ఎవరు అడ్డుపడ్డ రైతు భరోసా అందచేస్తాం అని స్పష్టంచేశారు. 

ఇది కూడా చదవండి: AP News: ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ

Rythu Bharosa: తెలంగాణని రూ. 16 వేల కోట్ల మిగులుతో కెసిఆర్ కి అప్పగిస్తే.. పదేళ్ల తర్వాత రూ.7 లక్షల అప్పులతో తెలంగాణ రాష్ట్రాన్ని తమకు అప్పగించారన్నారు రేవంత్ తెలిపారు. ఇన్సిపెండెన్సు వచ్చిన ఈని సంవత్సరంలో ఏ ప్రభుత్వం తక్కువ సమయంలో రుణమాఫీ చేయలేదు అన్నారు రేవంత్ రెడ్డి. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకూ.. ఐదేళ్లలో రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రూ.2 లక్షల వరకూ రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి.. రైతులకు రూ.2 లక్షల వరకూ రుణమాఫీ 100 శాతం చేసాం అని రేవంత్ రెడ్డి చెప్పారు. . తెలంగాణకు భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 25లక్షల 35వేల మంది రైతులకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపారు. రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశామన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *