Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి అనేక కీలక నిర్ణయాలను ప్రకటించారు.
🔹 డీఏ పెంపు:
ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 1వ తేదీన ఈ డీఏ మొత్తాన్ని జమ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పెంపుతో ప్రభుత్వంపై నెలకు రూ.160 కోట్ల అదనపు భారం పడనుంది.
🔹 పోలీసుల ఎర్న్ లీవ్ (EL):
పోలీసులకు ఒక ఇన్స్టాల్మెంట్ ఎర్న్ లీవ్ (EL) ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.105 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. జనవరి నెలలో మరో రూ.105 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
🔹 చైల్డ్ కేర్ లీవ్:
ఉద్యోగినులు ఎప్పుడైనా తమ సౌకర్యానుసారం చైల్డ్ కేర్ లీవ్స్ వాడుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు.
🔹 ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు:
దీపావళి పర్వదినానికి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు.
🔹 గౌరవప్రదమైన పదవులు:
కింది స్థాయిలోని కొంతమంది ఉద్యోగులకు గౌరవప్రదమైన డిజిగ్నేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
🔹 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్:
ఫైనాన్స్ కమిషన్ కింద రూ.2,793 కోట్లు విడుదల చేశామని, 74 కేంద్ర పథకాలను రెగ్యులరైజ్ చేసినట్లు సీఎం వెల్లడించారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “దక్షిణ భారతదేశంలో మనం వెనుకబడే పరిస్థితి రాకుండా స్ట్రక్చరల్ కరెక్షన్లు చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈ ప్రయాణంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక భాగస్వాములు. వెల్దీ, హెల్తీ, హ్యాపీ సొసైటీని నిర్మించడమే మన లక్ష్యం” అని అన్నారు.