Cm chandrababu: అనుకున్న టైంకి పని అయిపోవాలి

Cm chandrababu: అమరావతి నగర నిర్మాణం మరోసారి వేగం అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజధాని పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో, ప్రాజెక్ట్‌ పనులపై సీఎం చంద్రబాబు మరింత దృష్టి సారించారు.

అమరావతి ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్న కాంట్రాక్టర్లు, సంస్థల యజమానులు అలాగే ఉన్నత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, నాణ్యత, అమలు వేగంపై వివరాలు సేకరించారు.

రాజధాని నిర్మాణం అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని, నాణ్యతలో ఎలాంటి రాజీ పడరాదని చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువులో పనులు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పనుల వేగం ఇంకా పెంచాలని, ప్రతి దశను అత్యుత్తమ ప్రమాణాలతో పూర్తి చేయాలని సీఎం సూచించారు. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అధికారులకు తెలియజేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *