Chandrababu Naidu

Chandrababu Naidu: నేడు అల్లూరి జిల్లా సీఎం చంద్రబాబు పర్యటన.. గిరిజనులతో మాట ముచ్చట..

Chandrababu Naidu: అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాడేరు పర్యటనకు రానున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో లగిశపల్లికి చేరుకొని, అక్కడి నుంచి వంజంగికి బయలుదేరుతారు.

గిరిజనులతో మమేకం
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా గిరిజనుల సంస్కృతి, జీవన విధానాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వంజంగిలోని సావడి దగ్గర జరిగే ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేయడం ద్వారా వారి ఆనందంలో పాలుపంచుకుంటారు. అలాగే, మట్టి గోడలతో నిర్మించిన హోం స్టేను సందర్శించి, గిరిజనుల సంప్రదాయ గృహ నిర్మాణ శైలిని పరిశీలిస్తారు.

కాఫీ రైతుల సమస్యలపై ముఖాముఖి
గిరిజనుల ఆర్థికాభివృద్ధికి కీలకమైన కాఫీ పంటపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. వంజంగిలో కాఫీ రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలు, పంట మార్కెటింగ్ సవాళ్లను అడిగి తెలుసుకోనున్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై హామీ ఇస్తారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
మధ్యాహ్నం లగిశపల్లికి చేరుకున్న తర్వాత, కస్తూర్బాగాంధీ విద్యాలయం ఎదురుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నూతన పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో పాటు కీలకమైన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించి, గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తారు.

గిరిజనుల సంక్షేమం, వారి సంస్కృతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చాటిచెప్పడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యమంత్రి పర్యటనతో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు పాడేరు నుంచి హెలికాప్టర్‌లో విజయవాడకు తిరిగి పయనం కానున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: ఈ కథలన్నీ నా దగ్గర వద్దు..DSP పవన్ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *