AP news: అక్రమార్కులపై సిట్ దర్యాప్తు.. ఆదేశించిన సీఎం

AP news: గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మాఫీయా కార్యకలాపాలను విచారించేందుకు సిట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నాయి.

గత ఐదు సంవత్సరాలలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ నివేదికలు సమర్పించబడ్డాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు భూకబ్జా, అక్రమ నిర్మాణాలు, పోర్టులు, డిస్టిలరీలు, ప్రాజెక్టులు, మైన్స్ విషయంలో అవినీతి పాలు అయ్యారు.

రేషన్ బియ్యం మాఫీయా పై కూడా కీలక ఆధారాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అలాగే, జిల్లాల స్థాయిలో వైసీపీ నేతలు చేస్తున్న ఆగడాలు అక్రమాలపై కూడా నివేదికలు అందాయి.

ప్రస్తుతం, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు ప్రభుత్వానికి పలు కీలక నివేదికలు సమర్పించాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల అక్రమాలను విచారించేందుకు ప్రభుత్వం దరఖాస్తుల వెల్లువను ఎదుర్కొంటోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *