Chamala: కవిత ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన ఎంపీ

Chamala: తెలంగాణను దేళ్లలో మిగులు రాష్ట్రంగా నిలిపిన పరిస్థితి నుంచి అప్పుల రాష్ట్రంగా మార్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీశ్‌రావు అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను గుర్తుచేశారు.

కవిత సమర్పించిన ఆధారాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఎంపీ చామల యాదగిరిగుట్ట పట్టణ పోలీస్‌స్టేషన్లో హరీశ్‌రావు, సంతోష్ రావు, నవీన్ రావులపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ “బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సంపదను దోచుకున్నారు. రెండు సంవత్సరాలుగా పాలన చేస్తున్న కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి వారికి నైతిక హక్కు లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయం వెంటాడుతోంది. అందుకే బీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు,” అని మండిపడ్డారు.

అలాగే ఆయన జోడించారు “ఉప ఎన్నికలో ఎవరి సత్తా ఏంటో ప్రజలు తేల్చిపెడతారు. అవినీతి, కుటుంబ పాలనకు ప్రజలు ఇక మోసపోరని కాంగ్రెస్‌పై నమ్మకం ఉంచండి,” అని ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *