Meenakshi Natarajan:

Meenakshi Natarajan: ఎన్నికల సంఘం తీరుపై నమ్మకం లేదు.. సుప్రీంపై మాట్లాడను

Meenakshi Natarajan: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల ప్రక్రియ మధ్యలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని, ఎన్నికల తర్వాత ‘ఎన్నికల పిటిషన్’ వేసుకోవడమే మార్గమని స్పష్టం చేసింది. ఫామ్ 26 లో ప్రైవేట్ కేసు దాచారనే కారణంతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురికాగా, తాను ఏ సమాచారమూ దాచలేదని నటరాజన్ స్పష్టం చేస్తూ.. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపించారు.

మరింత Meenakshi Natarajan: ఎన్నికల సంఘం తీరుపై నమ్మకం లేదు.. సుప్రీంపై మాట్లాడను
Chandrababu

Chandrababu: అమరావతిని ఎవరూ ఆపలేరు.. చర్చకు మేం సిద్ధం!

Chandrababu: కూటమి రెండేళ్ల పాలన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల విధ్వంస పాలన వల్ల కుప్పకూలిన వ్యవస్థలను తాము బాగు చేస్తున్నామన్నారు. తిరుమలను అపవిత్రం చేసిన వారు అనుభవిస్తారన్నారు. రాయలసీమను రూ. లక్ష కోట్లతో బంగారు సీమగా మారుస్తామని.. పుట్టపర్తిలో 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్లాంట్, తిరుపతిలో రూ. 2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఫ్యాక్టరీ వస్తున్నాయని ప్రకటించారు. వచ్చే నెలలో సీమ స్టీల్ ప్లాంట్ తెరుస్తామన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, 15,700 పోస్టుల డీఎస్సీ పూర్తి చేశామని స్పష్టం చేస్తూ.. హామీల అమలుపై వైసీపీతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.

మరింత Chandrababu: అమరావతిని ఎవరూ ఆపలేరు.. చర్చకు మేం సిద్ధం!
Pawan Kalyan

Pawan Kalyan: కూటమి కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది

Pawan Kalyan: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాడు తాను 21 సీట్లు తీసుకున్నానని, కూటమి కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారు. రాష్ట్రం కులాల పరిమితులు దాటి భారతీయత వైపు వెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే, దేశ ప్రగతి గ్రామాల్లోనే నిర్ణయించబడుతుందని, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి, ఇచ్చిన ప్రతి హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మరింత Pawan Kalyan: కూటమి కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది
Nara Lokesh

Nara Lokesh: మనది ఫైటర్ జెట్.. వాళ్లది ఫ్యాక్షన్.. రెడ్ బుక్ దాని పని అది చేసుకుపోతుంది!

Nara Lokesh: తిరుపతి కూటమి సభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. రెండేళ్ల పాలనలో దాడులు, బూతులు లేని స్వేచ్ఛా వాతావరణం కల్పించామన్నారు. దేవుడితో పెట్టుకున్నందుకే జగన్‌కు ఈ గతి పట్టిందన్నారు. కూటమిది క్రెడిబిలిటీ అయితే వైసీపీది క్రిమినాలిటీ అని.. కియా తెచ్చిన ఘనత బాబుదైతే, కిడ్నాప్‌లు చేసింది వైసీపీ అని మండిపడ్డారు. చంద్రబాబు సీమను రత్నాల సీమగా మార్చారని చెబుతూ.. అరాచకాలకు పాల్పడితే ‘రెడ్ బుక్’ తన పని తాను చేసుకుపోతుందని లోకేశ్ హెచ్చరించారు.

మరింత Nara Lokesh: మనది ఫైటర్ జెట్.. వాళ్లది ఫ్యాక్షన్.. రెడ్ బుక్ దాని పని అది చేసుకుపోతుంది!
Kona Shashidhar

Kona Shashidhar: మెగా డీఎస్సీ వంద శాతం పారదర్శకం.. లీకేజీకి ఆస్కారమే లేదు!

Kona Shashidhar: మెగా డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. టీసీఎస్ అయాన్ ద్వారా 42 వేల ప్రశ్నల బ్యాంక్‌తో, రోజువారీ పాస్‌వర్డ్‌లు మారుస్తూ పరీక్షలు జరిపామన్నారు. టెట్ 20%, డీఎస్సీ 80% వెయిటేజీతో మెరిట్ లిస్ట్ ఇచ్చామని.. 1:1 కాల్‌లెటర్ వస్తే ఉద్యోగం ఖాయం కాదన్నారు. ఫస్ట్ ర్యాంకర్ నవీన్ వెరిఫికేషన్‌కు రానందున ఉద్యోగం ఇవ్వలేమన్నారు. సందేహాల కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేశామని, త్వరలో మరో డీఎస్సీ ఉంటుందని వెల్లడించారు.

మరింత Kona Shashidhar: మెగా డీఎస్సీ వంద శాతం పారదర్శకం.. లీకేజీకి ఆస్కారమే లేదు!
TRS

TRS: టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ సెంటిమెంట్..!

TRS: కవిత ఏర్పాటు చేయబోతున్న ‘తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్‌)’ పార్టీ పేరుపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీఐకి ఫిర్యాదు చేసింది. ప్రజలు ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గానే గుర్తుంచుకున్నారని, ఈ పేరు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నందున వేరే ఎవరికీ కేటాయించవద్దని కోరింది. కాగా, ఈ పేరుపై ఈసీఐకి ఇప్పటివరకు దాదాపు 700 అభ్యంతరాలు రావడం విశేషం.

మరింత TRS: టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ సెంటిమెంట్..!
Attacks Must End:

Attacks Must End: ఒమన్ తీరంలో నౌకలపై అమెరికా దాడులు.. ముగ్గురు భారతీయుల మృతి..!

Attacks Must End: ఒమన్ తీరంలో అమెరికా జరిపిన దాడుల వల్ల నౌకల్లో ఉన్న ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, పలువురిని రక్షించారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ న్యూఢిల్లీలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. పశ్చిమ ఆసియాలో దాడులు ఆపి చర్చలు జరపాలని కోరింది. ప్రస్తుతం గల్ఫ్ రీజియన్‌లో 18 వేల మందికి పైగా భారతీయ నావికులు ఉన్నందున వారి భద్రతపై కేంద్రం నిరంతర నిఘా ఉంచింది.

మరింత Attacks Must End: ఒమన్ తీరంలో నౌకలపై అమెరికా దాడులు.. ముగ్గురు భారతీయుల మృతి..!
Meenakshi Natarajan:

Meenakshi Natarajan: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ముగ్గురు బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవం!

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో బీజేపీ అభ్యర్థులు Meenakshi Natarajan: తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అన్యాయంపై రేపు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

మరింత Meenakshi Natarajan: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ముగ్గురు బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవం!
TG Journalists

TG Journalists: జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. జూన్ 17 నుండి కొత్త ఆర్టీసీ బస్ పాస్‌లు..!

TG Journalists: తెలంగాణ ప్రభుత్వం 2026-2028 కాలానికి కొత్త అక్రిడిటేషన్లు పొందిన జర్నలిస్టులకు రాయితీ బస్ పాస్‌లు ఇవ్వాలని టీజీఎస్‌ఆర్‌టీసీని కోరింది. ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముкуంద రెడ్డి రాసిన లేఖ ప్రకారం.. పాత పాస్‌ల గడువు జూన్ 16తో ముగియనుండగా, కొత్త పాస్‌లు 17.06.2026 నుండి 30.04.2028 వరకు చెల్లుబాటు అవుతాయి. జర్నలిస్టులు జూన్ 17 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత TG Journalists: జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. జూన్ 17 నుండి కొత్త ఆర్టీసీ బస్ పాస్‌లు..!
Raj Kasireddy Arrest

Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. కింగ్ పిన్ రాజ్‌కసిరెడ్డి అరెస్ట్..!

Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ రవాణా టెండర్ల స్కామ్‌లో రూ. 349 కోట్ల అవకతవకలు, హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు హైదరాబాద్‌లో 10 చోట్ల సోదాలు నిర్వహించి, ప్రధాన సూత్రధారి రాజ్‌కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ సిట్ (SIT) నాలుగు చార్జ్‌షీట్లు దాఖలు చేయగా, ఈడీ ఎంట్రీతో విచారణ మరింత వేగవంతమైంది.

మరింత Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. కింగ్ పిన్ రాజ్‌కసిరెడ్డి అరెస్ట్..!