BSNL Recharge: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 4జీ నెట్వర్క్ విస్తరణ పూర్తి చేసిన అనంతరం, కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ “ఫ్రీడమ్ ప్లాన్” పేరుతో ప్రత్యేక ఆఫర్ను ప్రారంభించింది.
ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే, కేవలం రూ.1 చెల్లせితే చాలు – నెల రోజుల పాటు BSNL 4G సేవలు ఉచితంగా వాడవచ్చు.
ఫ్రీడమ్ ప్లాన్లో లభించే సేవలు:
-
అపరిమిత వాయిస్ కాల్స్ (లొకల్ / STD)
-
రోజుకు 2జీబీ హై స్పీడ్ డేటా
-
రోజుకు 100 ఎస్ఎంఎస్లు
-
ఉచిత BSNL సిమ్
ఈ ప్లాన్ ద్వారా, వినియోగదారులు BSNL 4G నెట్వర్క్ను పరీక్షించుకునే అవకాశాన్ని పొందుతారు. ఇది స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన ప్రత్యేక ఆఫర్ కావడం గమనార్హం.
BSNL చైర్మన్ వ్యాఖ్యలు:
బీఎస్ఎన్ఎల్ చైర్మన్ ఏ. రాబర్ట్ జె. రవి మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కింద దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ టెక్నాలజీని అందరికీ అనుభవించాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ను తీసుకొచ్చాం. ప్రతి భారతీయుడు మా నెట్వర్క్ తేడా ఏంటో తెలుసుకుంటారు అని నమ్ముతున్నాం అని అన్నారు.
ఇది కూడా చదవండి: Operation Akhal: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది మృతి
ప్రత్యర్థుల పరిస్థితి:
ప్రైవేట్ టెలికాం సంస్థలు:
-
జియో – రూ.349
-
ఎయిర్టెల్ – రూ.379
-
వొడాఫోన్ ఐడియా – రూ.399
ఇలా ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తున్నాయి. అయితే ఇవి 5G సేవలు, వినోద యాప్ల యాక్సెస్ కూడా కలిపి ఇస్తున్నాయి.
ప్రభుత్వం లక్ష్యం:
ఈ ఆఫర్ విడుదల చేయడం కొన్ని రోజుల కిందటే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేసిన సూచన తర్వాత జరిగింది. బీఎస్ఎన్ఎల్ 50 శాతం మొబైల్ వ్యాపార వృద్ధి సాధించాలని, అలాగే ఫైబర్, ల్యాండ్లైన్, ఎంటర్ప్రైజ్ వ్యాపారాలు 25-30 శాతం పెరగాలని మంత్రి సూచించారు.