Mumbai: ముంబైలో ఈ స్కూళ్లకు బాంబ్ బెదిరింపు కాల్..

Mumbai: ముంబై నగరంలోని జోగేశ్వరి–ఓషివారా ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం సంచలనం సృష్టించింది. పాఠశాల ఆవరణలో బాంబు పెట్టామని మెయిల్‌లో పేర్కొనడంతో, పాఠశాల యాజమాన్యం వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించింది.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదు.

బెదిరింపు మెయిల్‌లో అఫ్జల్ గ్యాంగ్ పేరును ప్రస్తావించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tirupati Stampede Video: తిరుపతి ఘటనపై మాహా వంశీ గ్రౌండ్ రిపోర్ట్.. నిజానిజాలివే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *