Bangladesh Plane Crash:

Bangladesh Plane Crash: బంగ్లాదేశ్‌లో స్కూల్‌పై కుప్ప‌కూలిన‌ విమానం.. 20 మంది దుర్మ‌ర‌ణం

Bangladesh Plane Crash: భార‌త‌దేశంలోని అహ్మ‌దాబాద్‌లో ఓ క‌ళాశాల‌పై విమానం కూలిన ఘోర దుర్ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే బంగ్లాదేశ్‌లోని ఓ పాఠ‌శాల‌పై విమానం కూలింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు 20 మంది వ‌ర‌కు చ‌నిపోయిన‌ట్టు నిర్ధారించారు. ఇదే ప్ర‌మాదంలో మ‌రో 170 మందికి పైగా గాయాల‌పాల‌య్యాయి. బంగ్లాదేశ్ వాయిసేన‌కు చెందిన ఎఫ్‌-7 బీజీఐ శిక్ష‌ణ విమానం నిన్న (జూలై 21) మ‌ధ్యాహ్నం ఒంటిగంట స‌మ‌యంలో ఆ దేశ రాజ‌ధాని ఢాకాలో కుప్ప‌కూలింది.

Bangladesh Plane Crash: ఢాకా ఎయిర్ బేస్ నుంచి టేకాప్ అయిన‌ కాసేప‌టికే ఆ విమానంలో సాంకేతిక లోపాలు త‌లెత్తాయి. దీంతో ఒక్క‌సారిగా న‌గ‌రంలోనే ఉన్న మైల్స్ స్టోన్ స్కూల్‌పై విమానం కుప్ప‌కూలింది. ప్ర‌మాద స‌మ‌యంలో ఆ విమానంలో ఒక పైలట్ మాత్ర‌మే ఉన్నాడు. ఈ ప్ర‌మాదంలో పైల‌ట్ తౌకీర్ ఇస్లాంతోపాటు మైల్స్ స్టోన్ పాఠ‌శాలలోని ఇద్ద‌రు ఉపాధ్యాయులు, అదే పాఠ‌శాల‌కు చెందిన 17 మంది విద్యార్థులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

Bangladesh Plane Crash: విమానంలో ఏర్ప‌డిన సాంకేతిక కార‌ణాల‌తో ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ద‌ని బంగ్లాదేశ్ సైన్యానికి చెందిన ఇంట‌ర్ స‌ర్వీస్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ (ఐఎస్‌పీఆర్) వెల్ల‌డించింది. ఇదే విష‌యాన్ని ఆ విమాన పైల‌ట్‌ ఏటీసీకి స‌మాచారం అందించిన‌ట్టు తెలిపింది. వాస్త‌వంగా ఆ విమానం జ‌న‌స‌మ్మ‌ర్థం ఉన్న ప్రాంతంలో ప‌డాల్సి ఉండ‌గా, పైల‌ట్ స‌మ‌య‌స్ఫూర్తితో ఉత్త‌ర ఢాకా వైపు మ‌ళ్లించ‌గా, అక్క‌డి స్కూల్‌పై ప‌డింద‌ని పేర్కొన్న‌ది.

Bangladesh Plane Crash: ఈ విమాన ప్ర‌మాదం స‌మ‌యంలో అక్క‌డ భీతావ‌హ దృశ్యం క‌నిపించింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో 170 మందికి పైగా క్ష‌త‌గాత్రుల‌య్యారు. వారంద‌రినీ వెంట‌నే కంబైన్డ్ మిలిట‌రీ హాస్పిట‌ల్‌కు, స‌మీపంలో ఉన్న ఇత‌ర ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. వైమానిక ద‌ళ హెలికాప్ట‌ర్లు, అంబులెన్స్‌ల స‌హాయంతో వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. వారంతా ఆయా ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *