Starlink: ఇరాన్ యుద్ధంలో స్టార్లింక్ టెర్మినల్స్ వాడకంపై వచ్చిన నివేదికల నేపథ్యంలో భారత హోం శాఖ స్టార్లింక్ అనుమతులను నిలిపివేసింది. ముంబైలో హబ్, 10 గేట్వేలు సిద్ధంగా ఉన్నా జాతీయ భద్రత దృష్ట్యా కేంద్రం బ్రేకులు వేసింది. జూన్ 12న స్పేస్ఎక్స్ ఐపీఓ ఉన్న తరుణంలో ఇది మస్క్కు పెద్ద ఎదురుదెబ్బ. అలాగే జియో, ఎయిర్టెల్ శాటిలైట్ విభాగాలపై కూడా డేటా భద్రత విషయంలో కేంద్రం తీవ్ర స్క్రూటినీ చేస్తోంది.
మరింత Starlink: ఎలాన్ మస్క్కు భారత్ గట్టి షాక్.. నిలిచిపోయిన ‘స్టార్లింక్’ అనుమతులు..!Author: MAHAA News Desk
Revanth Reddy: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా టార్గెట్..!
Revanth Reddy: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని 553 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ టార్గెట్ అని చెప్తూ.. రూ. 61,000 కోట్ల లింకేజీలు, రూ. 2,000 కోట్ల సున్నా వడ్డీ నిధులు ఇచ్చామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 4,000 కోట్ల బకాయిలు పెట్టిందని, నాణ్యత లేని చీరలు ఇచ్చిందని విమర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా 27,000 స్కూళ్ల బాధ్యతలు, హైటెక్ సిటీలో రూ. 1000 కోట్ల భూమిని మహిళలకే కేటాయించామని సీఎం స్పష్టం చేశారు.
మరింత Revanth Reddy: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా టార్గెట్..!Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి, కార్యసిద్ధి.. మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: వృషభ, మిథున, కన్య, వృశ్చిక మరియు మీన రాశుల వారికి ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పురోగతి, అధికారుల మద్దతు, ప్రయత్నాలలో విజయాలు సూచిస్తున్నాయి. మేష, తుల, కుంభ రాశుల వారు ఒత్తిడికి లోనవకుండా, ఆరోగ్యం మరియు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి, కార్యసిద్ధి.. మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి!Dragon: శ్రీలంక వెళ్లనున్న డ్రాగన్ టీమ్.. అక్కడే
Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ ‘డ్రాగన్’ తదుపరి భారీ షెడ్యూల్ వచ్చే నెలలో శ్రీలంకలో జరగనుంది. హైదరాబాద్ షెడ్యూల్ ముగిసిన వెంటనే అక్కడ హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు తెరకెక్కించనున్నారు. 1967 నాటి ఓపియం (అఫిము) ట్రేడ్ బ్యాక్డ్రాప్తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.
మరింత Dragon: శ్రీలంక వెళ్లనున్న డ్రాగన్ టీమ్.. అక్కడేPawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ఘోరం చూడలేదు.. !
Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని, దీనిపై త్రీమెన్ కమిటీ విచారణ జరుపుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను అమ్మాలని చూసిందని, కానీ ప్రైవేటీకరణ జరగకూడదన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. మృతులకు రూ. 25 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ.. రెగ్యులర్ ఉద్యోగులకు రూ. 1.72 కోట్లు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 45.75 లక్షల ఆర్థిక ప్రయోజనం అందేలా చూస్తామన్నారు.
మరింత Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ఘోరం చూడలేదు.. !Black Thread: చేతికి నల్ల దారం కడుతున్నారా? ఆ మూడు ముడుల వెనుక రహస్యం ఇదే!
హిందూ సంప్రదాయంలో పూజల వేళ ఎరుపు, పసుపు దారాలు కట్టినా.. శివభక్తులు, కాలభైరవ ఆరాధకులు నల్ల దారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది నెగటివ్ ఎనర్జీ, దిష్టి నుండి రక్షణ ఇస్తుందని నమ్ముతారు. ఇందులో వేసే 3 ముడులు శ్రద్ధ, రక్షణ, శుభప్రదానికి చిహ్నాలు. సోమ, మంగళ, శనివారాల్లో ఆలయాల్లో పూజల అనంతరం దీనిని ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
మరింత Black Thread: చేతికి నల్ల దారం కడుతున్నారా? ఆ మూడు ముడుల వెనుక రహస్యం ఇదే!Hyderabad: హైదరాబాద్లో కొనసాగుతున్న ‘చేప ప్రసాదం’ పంపిణీ.. 3 లక్షల చేప పిల్లలు సిద్ధం!
Hyderabad: మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ ఘనంగా సాగుతోంది. ఆస్తమా నివారణకు ఇచ్చే ఈ ప్రసాదం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు తరలిరాగా.. మత్స్య శాఖ 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. శాకాహారులకు బెల్లంతో ఈ మందును ఇస్తున్నారు. ఈ పంపిణీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
మరింత Hyderabad: హైదరాబాద్లో కొనసాగుతున్న ‘చేప ప్రసాదం’ పంపిణీ.. 3 లక్షల చేప పిల్లలు సిద్ధం!Pawan Kalyan: విశాఖ కిమ్స్లో పవన్ కల్యాణ్ పరామర్శ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ!
Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన పవన్, గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మరింత Pawan Kalyan: విశాఖ కిమ్స్లో పవన్ కల్యాణ్ పరామర్శ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ!Mahaa News: కెమెరాకు చిక్కిన ‘సైగలు’.. కేజీహెచ్లో లోకేష్ పర్యటన వేళ బట్టబయలైన కుట్ర..
Mahaa News: విశాఖ కేజీహెచ్లో స్టీల్ ప్లాంట్ బాధితులను మంత్రి నారా లోకేష్ పరామర్శించే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేయాలంటూ సాక్షి రిపోర్టర్ సైగలు చేస్తూ మహా న్యూస్ కెమెరాకు దొరికిపోయారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు.. తమ ఇంట్లో మనుషులు చనిపోతే చిల్లర రాజకీయాలు చేస్తారా అంటూ సాక్షి మీడియాపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకుంటుంటే కుట్రలు చేయడం ఏంటని జనాలు గట్టిగా నిలదీశారు.
మరింత Mahaa News: కెమెరాకు చిక్కిన ‘సైగలు’.. కేజీహెచ్లో లోకేష్ పర్యటన వేళ బట్టబయలైన కుట్ర..Nara Lokesh: కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కేజీహెచ్ ఆసుపత్రిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రులు, గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించాలని కేజీహెచ్ వైద్యులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మరింత Nara Lokesh: కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ