Telugu Titans: వరుసగా మూడు ఓటముల తర్వాత తెలుగు టైటాన్స్ విజయాన్ని అదుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-11 లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 28-26తో పట్నా పైరేట్స్ను ఓడించి మళ్లీ విజయాల బాట పట్టింది. ఈ మ్యాచ్ ఆద్యంతం రెండు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. నువ్వానేనా అన్నట్లుగా జరిగిన ఈ మ్యాచ్ లో ఫస్ట్ హాప్ ముగిసే సరికి టైటాన్స్ 10-13 తేడాతో వెనుకబడినా బ్రేక్ తర్వాత పుంజుకుంది. ఆశిష్ నర్వాల్ 9, కెప్టెన్ పవన్ సెహ్రవత్ 5, అంకిత్ 4 పాయింట్లతో రాణించడంతో టైటాన్స్ విజయాన్ని దక్కించుకుంది.
ఇది కూడా చదవండి: Nitish Kumar Reddy: అది నా చిన్నప్పటి కల..