CP Radhakrishnan: విశాఖపట్నంలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఈ వేదికకు చేరుకోవడంతో సదస్సు ప్రాంతం సందడిగా మారింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ సమావేశాన్ని ప్రారంభించి, భారత పరిశ్రమల అభివృద్ధి మార్గాన్ని విశాఖలో చర్చించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీతో పాటు అనేక అంతర్జాతీయ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

