Ap news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మారిటైమ్ పాలసీ 2024-29 ను విడుదల చేసింది. ఈ పాలసీ దృష్టి పోర్టు ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్స్ ఇతర మారిటైమ్ సేవలను ప్రోత్సహించడంపై ఉంది. ముఖ్యంగా, రాష్ట్రంలో నూతన మారిటైమ్ విజన్ను ఆవిష్కరించటం ద్వారా, భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ఒక కొత్త విధానాన్ని రూపొందించింది.
1. అధికారిక లక్ష్యాలు:
2030 నాటికి భారత మారిటైమ్ గేట్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం.
కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాలను పెంపొందించడం: మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం.
పోర్టు సామర్థ్యం పెంచడం: ప్రపంచంలోని 20 భారీ పోర్టుల్లో ఒకటి ఏపీ లో ఉండేలా లక్ష్యాన్ని ఏర్పరచడం.
2. 2047 నాటికి లక్ష్యం:
దేశంలోని మొత్తం పోర్టు కార్గోలో 20% ఏపీలో నిర్వహించేలా కార్యాచరణ చేపట్టడం.
3. నిపుణుల తయారీ:
పోర్టు సంబంధిత వ్యవహారాలలో 5 వేల మంది నిపుణులను 2028 నాటికి తయారు చేయడం.
ఏపీ మారిటైమ్ బోర్డు:
ఈ మారిటైమ్ పాలసీ అమలుకు ఏపీ మారిటైమ్ బోర్డు ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రం పోర్టు ఆధారిత రంగంలో కొత్త అధ్యయనాన్ని తీసుకురానుంది.