Amaravati: SSC వాల్యుయేషన్‌లో లోపాలు బయటపడ్డాయి – ఐదుగురి సస్పెన్షన్, విద్యార్థుల్లో ఆందోళన

Amaravati: రాష్ట్రంలో పదవ తరగతి (SSC) ఫలితాల ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. వాల్యుయేషన్‌లో తీవ్రమైన లోపాలు వెల్లడవడంతో పాఠశాల విద్యాశాఖ చర్యలకు దిగింది. పదవ తరగతి ఫలితాలపై అసంతృప్తితో రికార్డు స్థాయిలో 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ మరియు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయగా, ఇప్పటివరకు 11,175 స్క్రిప్టుల్లో మార్కులలో లోపాలు గుర్తించారు.

ఈ నేపథ్యంలో, బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన ఐదుగురు వాల్యుయేషన్ సిబ్బందిని పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టి, మరిన్ని చర్యలకు సిద్ధమవుతున్నారు. వాల్యుయేషన్ లోపాలతో పలు విద్యార్థుల భవిష్యత్ ప్రభావితమవుతోంది.

జూన్ మొదటివారంలో RV, RC ఫలితాలు

రీవాల్యుయేషన్ (RV), రీకౌంటింగ్ (RC) ఫలితాలను జూన్ మొదటి వారం నాటికి పూర్తిగా ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఆ ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.

ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు గడువు ముగింపు – విద్యార్థులలో ఆందోళన

ఇదే సమయంలో, ట్రిపుల్ ఐటీ (RGUKT) ప్రవేశాలకు గడువు ముగియడంతో విద్యార్థులు గందరగోళానికి లోనవుతున్నారు. RV, RC ఫలితాలు రాకముందే చివరి తేదీ ముగియడం వల్ల అనేక మంది విద్యార్థులు ప్రవేశ అవకాశాల నుంచి వెనక్కి పడే పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో, పాఠశాల విద్యాశాఖ జూన్ 5 నుంచి 10 వరకు ట్రిపుల్ ఐటీ దరఖాస్తుల గడువును పొడిగించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేసింది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *