Air India flight:

Air India flight: కాంగ్రెస్ కీల‌క నేత‌ ఉన్న ఆ విమానానికి తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

Air India flight: మ‌రో ఎయిర్ ఇండియా విమానం చిక్కుల్లో ప‌డింది. 2 గంట‌ల‌పాటు గాలిలోనే చ‌క్క‌ర్లు కొట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఏఐసీసీ కీల‌క నేత కేసీ వేణుగోపాల్‌, ఇత‌ర కాంగ్రెస్ ఎంపీలు ఉన్న ఆ విమానం వెళ్లేందుకు వాతావ‌ర‌ణం స‌హ‌క‌రించ‌లేదు. సిబ్బంది స‌మ‌య‌స్ఫూర్తితో ఆ విమానానికి తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది.

Air India flight: కేర‌ళ రాష్ట్ర రాజ‌ధాని న‌గ‌ర‌మైన ట్రివేండ్రం నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం బ‌య‌లుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే ఆ విమానానికి వాతావ‌ర‌ణం స‌హ‌క‌రించ‌లేదు. దీంతో పైలెట్లు ఆ విమానాన్ని దారి మ‌ళ్లించి చెన్నై వైపు మ‌ళ్లించారు. దాదాపు రెండు గంట‌ల పాటు గాలిలోనే చ‌క్క‌ర్లు కొట్టించారు. ఆ త‌ర్వాత చెన్నైలో సేఫ్ ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Air India flight: విమానం గాలిలో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మ‌యంలో ఆ విమానంలో ఉన్న ప్ర‌యాణికులంతా ప్రాణాల‌ను అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఆ రెండు గంట‌లు గ‌డిపారు. ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సిబ్బంది కూడా గాబ‌రా ప‌డ్డారు. సేఫ్ ల్యాండ్ అయ్యాక అంతా ఊపీరి పీల్చుకున్నారు. అదే విమానంలో కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్‌, ఇత‌ర కాంగ్రెస్ ఎంపీలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: నేను యాక్సిడెంటల్ యాక్టర్.. గత్యంతరం లేక టెక్నీషియన్ అయ్యాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *