Ahmedabad

Ahmedabad: పేలిన ట్రక్ టైర్.. కాలిపోయిన లారీలు.. ఇద్దరి మృతి

Ahmedabad: గుజరాత్‌లోని అహ్మదాబాద్-రాజ్‌కోట్ హైవేపై బుధవారం అర్థరాత్రి రెండు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి.బగోద్రా నుంచి బవాలాకు వెళ్తున్న బట్టలతో కూడిన ట్రక్కు టైరు పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత పేలుడు సంభవించింది. రెండు లారీలకు మంటలు అంటుకున్నాయి. పక్కనే వెళ్తున్న రెండు వాహనాలు కూడా ఢీకొన్నాయి.

ఇది కూడా చదవండి: Revanth Reddy: బెనిఫిట్ షోలు లేనట్టే.. సీఎం రేవంత్ స్పష్టీకరణ

Ahmedabad: దీని టైరు పగిలి బావ్లా నుంచి బగోద్రాకు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ట్రక్కులో గోధుమలు, బియ్యం బస్తాలు ఉన్నాయి. బట్టలు నింపిన ట్రక్కు రాంచోద్‌భాయ్ రాబరీ కంపెనీకి చెందినది. ట్రక్కు పాత డ్రైవర్‌ ప్రదీప్‌భాయ్‌ సెలవుపై వెళ్లాడు. అతని స్థానంలో కమలభాయ్ డ్రైవింగ్ చేశాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కమలభాయ్ మృతి చెందగా, మరో ప్రయాణికుడు కూడా మృతి చెందినట్లు సమాచారం.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MahaKumbh 2025: కుంభమేళా చూడటానికి వెళ్లి. సన్యాసం తీసుకున్న 14 ఏళ్ల అమ్మాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *