Emerging Asia Cup 2024: ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ విజేతగా ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టు నిలిచింది. ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్-ఏ టీమ్ శ్రీలంక-ఏపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో బిలాల్ సమీ 3 వికెట్లు, అల్లా ఘజన్ఫర్ 2 వికెట్లు తీసుకుని అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక ఇన్నింగ్స్లో సహన్ అరచ్చిగే 64 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చాంపియన్ గా నిలిచింది. ఆఫ్ఘన్ జట్టులో సెదికుల్లా అటల్ 55 పరుగులతో నాటౌట్ గా నిలిచి ఆఫ్ఘనిస్తాన్ను గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అల్లా ఘజన్ఫర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సెదికుల్లా అటల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు.
