Adinarayana: జగన్ కు జైలు తప్పదు..

Adinarayana:ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం చుట్టూ రాజకీయ భిక్షూకుడు ముసురుకుంటున్న వేళ, బీజేపీ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పక జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు.

“లిక్కర్ స్కాం కేసులో జగన్‌కి చిప్పకూడు తినడం ఖాయం. అయన ఐదేళ్ల పాలనలో జరిగిన భారీ అప్పులే ఈరోజు రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి. అయినా కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని నడిపిస్తున్నది,” అని ఆయన పేర్కొన్నారు.

జగన్‌పై తీవ్ర విమర్శలు

జగన్ ప్రతిరోజూ మీడియా ముందుకు రావడాన్ని విమర్శించిన ఆదినారాయణ రెడ్డి, “జైలు భయంతోనే ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. లిక్కర్ స్కాంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా జైలుకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది,” అని వ్యాఖ్యానించారు.

వైసీపీ భవిష్యత్తుపై ఆందోళన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అంధకారమైపోతుందన్న హెచ్చరికను కూడా ఆయన చేశారు. “ఈ కేసుల కారణంగా వైసీపీ రాజకీయంగా కనుమరుగయ్యే దశకు చేరుకుంటోంది,” అని అన్నారు.

జగన్ కౌంటర్ వ్యాఖ్యలు

ఇప్పటికే లిక్కర్ స్కాం ఆరోపణలపై జగన్ స్పందిస్తూ, “ప్రభుత్వం బేతాళ కథలు చెబుతోంది. నన్ను అరెస్ట్ చేయాలని కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోంది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి,” అని ఆరోపించారు. విద్యుత్‌ నుంచి ఇసుక‌ దాకా అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, కొత్త ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి కలిగించే విధంగా వ్యవహరిస్తోందని జగన్ విమర్శించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *