Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైవేపై వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొంది. దీంతో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన ఒక కుటుంబం భైంసా వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుడిహాత్నూరు మండలం మేకల గండి దగ్గర ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక మృతులను మొజుద్దీన్ (60), మొయినుద్దీన్ (40), అలీ (8), ఉస్మానుద్దీన్ (10), ఉస్మాన్ (12)గా గుర్తించారు.
Also Read: ఔటర్ పై ఘోర ప్రమాదం . . డాక్టర్ మృతి !