America: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో భారీ వివాదం చెలరేగింది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈస్ట్ వింగ్ (తూర్పు విభాగం) భవనాన్ని కూల్చివేసి, అక్కడ కొత్తగా ఆధునిక బాల్రూమ్ నిర్మించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.
సోమవారం నుంచే కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. అధికారుల ప్రకారం, ఈ వారాంతానికి మొత్తం భవనం నేలమట్టం కానుంది. ట్రంప్ ప్రణాళిక ప్రకారం, సుమారు 250 మిలియన్ డాలర్ల (దాదాపు ₹2,000 కోట్లు) వ్యయంతో కొత్త నిర్మాణం చేపట్టనున్నారు.
వేసవిలో ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు భవనానికి ఎలాంటి నష్టం చేయబోమని ట్రంప్ చెప్పినా, ఇప్పుడు పూర్తిగా కూల్చివేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన ట్రంప్,
> “మేము ఎప్పటికంటే ఎక్కువ పారదర్శకంగా ఉన్నాం. ఈ నిర్మాణం చాలా ఏళ్లుగా అవసరమని భావిస్తున్నాం,”అని వ్యాఖ్యానించారు.
చారిత్రక కట్టడాన్ని కూల్చడం ఎందుకు?
ఈస్ట్ వింగ్ను 1902లో నిర్మించారు, చివరిసారిగా 1942లో మార్పులు చేశారు. ఇది సాధారణంగా ఫస్ట్ లేడీ కార్యాలయం, ఇతర సిబ్బంది గదులు, ప్రత్యేక కార్యక్రమాలకు వినియోగించే విభాగం. మొదట దీనిని ఆధునికీకరించాలనే ఆలోచన ఉండగా, ప్రణాళిక దశలో కూల్చివేతే ఉత్తమ మార్గమని నిర్ణయించారని అధికారులు తెలిపారు.
విమర్శల వెల్లువ
‘నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్’ సంస్థ ఈ నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది. వైట్హౌస్ ఒక జాతీయ చారిత్రక చిహ్నం అని పేర్కొంటూ, కూల్చివేత పనులను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది.
డెమోక్రాటిక్ నేతలు కూడా ట్రంప్పై విరుచుకుపడ్డారు. మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ > “వైట్హౌస్ ట్రంప్ వ్యక్తిగత ఇల్లు కాదు… ఆయన దానిని నాశనం చేస్తున్నారు,”అని ఎక్స్ (X) వేదికలో పోస్ట్ చేశారు.
ట్రంప్ వివరణ
తన నిర్ణయాన్ని సమర్థించుకున్న ట్రంప్, ఈ ప్రాజెక్ట్ ఖర్చును తాను మరియు కొంతమంది దాతలు భరిస్తారని తెలిపారు. ఈ పనుల్లో సైన్యం కూడా పాల్గొంటోందని ఆయన వెల్లడించార