Telangana: తెలంగాణ‌లో మ‌రో మంత్రి ఇంటిలో చోరీ

Telangana: తెలంగాణ డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఇంటిలో చోరీ జ‌రిగి రెండు నెల‌లు తిర‌గ‌క ముందే మ‌రో మంత్రి ఇంటిలో చోరీ చోటుచేసుకున్న‌ది. ఈ రెండు ఘ‌ట‌న‌లు హైద‌రాబాద్ న‌గ‌రంలోని మంత్రుల నివాసాల్లోనే చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఆ నాడు డిప్యూటీ సీఎం ఇంటిలో న‌గ‌దు, బంగారు ఆభ‌ర‌ణాలు చోరీ అయ్యాయి. పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టి ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలోని ఖ‌ర‌గ్‌పూర్‌లో నిందితుల‌ను ప‌ట్ట‌కొని, న‌గ‌దు, ఆభ‌ర‌ణాల‌ను రిక‌వ‌రీ చేశారు.

Telangana: తాజాగా మ‌రో తెలంగాణ రాష్ట్ర‌ ఐటీ శాఖ‌ మంత్రి అయిన దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు ఇంటిలో జ‌రిగిన చోరీ వెలుగులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 12లోని మినిస్ట‌ర్ క్వార్ట‌ర్స్‌లో మంత్రి శ్రీధ‌ర్‌బాబు నివాసం ఉంటున్నారు. ఈ నెల 31న దీపావ‌ళి పండుగ రోజున ఆయ‌న సెల్‌ఫోన్ చోరీకి గురైంది. త‌న సెల్‌ఫోన్ వెతికి పెట్టాల్సిందిగా కోరుతూ పోలీసుల‌క ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ‌లో ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో దొంగ‌త‌నాలు నిత్య‌కృత్య‌మ‌య్యాయ‌న‌డానికి ఇలాంటి ఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌నమ‌ని పేర్కొంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *