AP News: అమరావతి సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం ఈ రోజు కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల పేర్లు మార్చడం, మండలాలు మరియు గ్రామాల సరిహద్దులు, పేర్లలో మార్పులు చేయడం వంటి విషయాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.
మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత సహా ఏడుగురు మంత్రులు హాజరయ్యారు. ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చ సాగింది.


