PM Kisan yojana:

PM Kisan yojana: పీఎం కిసాన్ నిధుల విడుద‌ల‌పై గుడ్‌న్యూస్‌!

PM Kisan yojana: ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి 20వ విడ‌త విడుద‌ల‌పై శుభ‌వార్త అందింది. ఇప్ప‌టి వ‌ర‌కూ కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించ‌కున్నా, సాయంత్రంలోగా (జూలై 17) ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ది. ఈ మేర‌కు రేపు (జూలై 18) 20వ విడ‌త రూ.2,000 సొమ్మును ఖాతాల్లో జ‌మ చేయ‌నున్న‌ట్టు దేశ‌వ్యాప్తంగా రైతులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

PM Kisan yojana: బీహార్‌లోని మోతీహారిలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హాజ‌ర‌వ‌నున్నారు. ఆ స‌భ‌లో పాల్గొన్న అనంత‌రం కిసాన్ స‌మ్మాన్ నిధి సొమ్మును ప్రధాని మోదీ విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం 19 విడ‌త‌ల్లో రూ.2,000 చొప్పున న‌గ‌దును రైతుల ఖాతాల్లో జ‌మ చేసింది. 20వ విడ‌త‌పై ఇంకా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంపై ఉత్కంఠ నెల‌కొన్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *